నిప్పులు చెరిగిన శాసన మండలి చైర్మన్
హైదరాబాద్ : ఏపీ కూటమి నేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ , తదితర నేతల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఉండాల్సిన కూటమి నేతలకు ఇక్కడ ఏం పని అని నిలదీశారు. హైదరాబాద్ లో కాదు ఉండాల్సింది మీరు వెళ్లాల్సింది, అమరావతి మీ ప్రాంతమని అక్కడే ఉండాలని ఇక్కడికి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు పారేసు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకునే రకం కాదని, అది తెలుసుకుంటే మంచిదన్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. నిప్పులు చెరిగారు తన కామెంట్స్ పై. ఆంధ్ర నాయకులు ఏపీ, తెలంగాణల మధ్య తరచూ రాకపోకలు సాగించడం మానుకోవాలని హితవు పలికారు. వారు తెలంగాణను పక్కన పెట్టి, ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.





