కూట‌మి నేత‌ల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని..?

Spread the love

నిప్పులు చెరిగిన శాస‌న మండ‌లి చైర్మ‌న్

హైద‌రాబాద్ : ఏపీ కూట‌మి నేత‌లు నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నారా లోకేష్ , త‌దిత‌ర నేత‌ల తీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఉండాల్సిన కూట‌మి నేత‌ల‌కు ఇక్క‌డ ఏం ప‌ని అని నిల‌దీశారు. హైద‌రాబాద్ లో కాదు ఉండాల్సింది మీరు వెళ్లాల్సింది, అమ‌రావతి మీ ప్రాంత‌మ‌ని అక్క‌డే ఉండాల‌ని ఇక్క‌డికి వ‌చ్చి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తామంటే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు పారేసు కోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకునే ర‌కం కాద‌ని, అది తెలుసుకుంటే మంచిద‌న్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియ‌స్ గా స్పందించారు. నిప్పులు చెరిగారు త‌న కామెంట్స్ పై. ఆంధ్ర నాయకులు ఏపీ, తెలంగాణల మధ్య తరచూ రాకపోకలు సాగించడం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. వారు తెలంగాణను పక్కన పెట్టి, ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి.

  • Related Posts

    సైకిల్ యాత్రకు తెలుగుదేశం శ్రీకారం

    Spread the love

    Spread the loveటీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అమ‌రావ‌తి : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ శుక్ర‌వారం రోజున‌ ఒక మహోత్తర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.…

    అరాచ‌క పాల‌న అంత‌మైన రోజు ఇది

    Spread the love

    Spread the loveమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *