నూతన అధ్యక్షుడు హరి ప్రసాద్ కామెంట్స్
బెంగళూరు : ఏఐసీసీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఉన్న సీఎంగా కొలువు తీరిన డీకే శివకుమార్ ను పక్కన పెట్టింది. ఆయన స్థానంలో హరి ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించింది. ఇది ఆ పార్టలో విస్తృత చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాయకత్వ మార్పుల నేపథ్యంలో సంస్థాగత , రాజకీయ ప్రయోజనాలను సమతుల్యం చేసే విస్తృత ప్రయత్నంలో భాగంగానే, బి.కె. హరిప్రసాద్ను కొత్త కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కనిపిస్తోంది.
మే 30న ప్రచురించిన ఒక నివేదికలో మంత్రి పదవి, పార్టీ సంస్థాగత బాధ్యతలను వేరు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న హరిప్రసాద్, తీరప్రాంతంతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ప్రారంభ రోజుల్లో సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోళి పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ఒకే నాయకుడికి మంత్రివర్గ పదవిని , రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను రెండింటినీ అప్పగించ కూడదని పార్టీ చివరికి నిర్ణయం తీసుకుంది. జార్కిహోళి ప్రభుత్వంలోనే కొనసాగడంతో, పార్టీ సంస్థాగత పగ్గాలను హరిప్రసాద్ చేపట్టడానికి మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా హరి ప్రసాద్ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.






