ప్రకటించిన చంద్రబాబు నాయుడు
అమరావతి : తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ముగ్గురు సభ్యులను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎంపికైన వారిలో సానా సతీష్ , చింతకాయల విజయ్ , భాష్యం రామకృష్ణ ఉన్నారు. కూటమికి సంబంధించి అవకాశమున్న మొత్తం నాలుగు సీట్లలో ఒకటి జనసేనకు మూడు టీడీపీ కి కేటాయించారు. మరో వైపు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల బిల్లు చట్ట సభల్లో పెండింగ్ లో ఉన్నప్పటికీ.. తాము చేతల్లో రిజర్వేషన్లను అమలు చేసి చూపిస్తామని టీడీపీ అధినేత గొప్పగా ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు.
రాజ్యసభ సీట్ల కేటాయింపులో మహిళలకు ఒక స్థానాన్ని కేటాయించి తద్వారా మూడింటిలో ఒకటి.. అంటే ముప్పై మూడు శాతం అమలు చేసినట్లు అవుతుందని టీడీపీ నేతలు ప్రచారం కూడా చేశారు .కానీ ఆచరణలో విఫలమయ్యారు . మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మాట తప్పారనే అపవాదును టీడీపీ మూట కట్టుకున్నట్లయిందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.






