సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశాఉ. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం TDP బాధ్యతల నుంచి పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు కంచర్ల శ్రీకాంతను తప్పించారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన కుప్పం టీడీపీ నేతల సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో శ్రీకాంత్ మాట్లాడిన తర్వాత కుప్పం నా నియోజకవర్గం.. ఇకపై అన్ని నేనే చూసుకుంటానని ప్రకటించారు .
అవసరమైతే రాష్ట్ర స్థాయిలో మీ సేవలను వాడుకుంటానని అన్నారు చంద్రబాబు నాయుడు. కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ఇక నుంచి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు సంబంధిత శాఖల బాధ్యతలు మాత్రమే చూడాలని స్పష్టం చేశారు. ఎవరైనా కాదని గీత దాటేందుకు ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. మరో మూడు నెలల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. రెండు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తానని అన్నారు.






