కుప్పం బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు
అమ‌రావ‌తి : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాఉ. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం TDP బాధ్యతల నుంచి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు కంచర్ల శ్రీకాంతను తప్పించారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన కుప్పం టీడీపీ నేతల సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో శ్రీకాంత్ మాట్లాడిన తర్వాత కుప్పం నా నియోజకవర్గం.. ఇకపై అన్ని నేనే చూసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు .

అవసరమైతే రాష్ట్ర స్థాయిలో మీ సేవలను వాడుకుంటాన‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు. కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తాన‌ని చెప్పారు. ఇక నుంచి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు సంబంధిత శాఖల బాధ్యతలు మాత్ర‌మే చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా కాద‌ని గీత దాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని వార్నింగ్ ఇచ్చారు. మరో మూడు నెలల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. రెండు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తాన‌ని అన్నారు.

  • Related Posts

    నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు

    హైద‌రాబాద్ : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేద‌న్నారు. త‌నపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…

    నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేస్తాం

    హైద‌రాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. కేవ‌లం గ‌త కొంత కాలం నుంచి పార్టీ కోసం నిస్వార్థంగా, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసిన పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *