ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

హ‌వాలా, మ‌నీ లాండ‌రింగ్ ద్వారా నిధులు

హైద‌రాబాద్ : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేప‌ట్టింది. హవాలా , మనీ లాండరింగ్ ద్వారా నిధులు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏపీ లిక్క‌ర్ స్కాం క‌ల‌కలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన మద్యం కుంభకోణానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేప‌ట్ట‌డం క‌ల‌క‌లం రేపింది.

గురువారం ఉదయం నుండి హైదరాబాద్‌లోని అరడజను ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన రాజ్ కేసీ రెడ్డి తో పాటు ఇందులో ప్రమేయం ఉన్న ఇతరుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొన‌సాగుతున్నాయి. హవాలా , మనీ లాండరింగ్ మార్గాల ద్వారా నిధులు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఇప్ప‌టికే లిక్క‌ర్ స్కాం లో ప‌లువురిని నిందితులుగా ఐడెంటిఫై చేసింది.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *