తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ రిజ‌ల్ట్స్ రిలీజ్

ప్ర‌క‌టించిన ఇంటర్మీడియ‌ట్ బోర్డు

హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు (టీఐబీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల రాష్ట్రంలో నిర్వహించిన ఇంట‌ర్మీడియ‌ట్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 68.84% ఉండ‌గా రెండవ సంవత్సరంలో 49.29%గా నమోదైన‌ట్లు తెలిపింది బోర్డు. మరోసారి బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారని స్ప‌ష్టం చేసింది. .

ఇదిలా ఉండ‌గా బాలికల ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 76.10 శాతంగా, రెండవ సంవత్సరంలో 52.56 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా, బాలురు మొదటి సంవత్సరంలో 62.57 శాతం , రెండవ సంవత్సరంలో 47.45 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,98,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మ‌రో వైపు ఈ ప‌రీక్ష‌ల్లో కూడా ఫెయిల్ అయిన వారికి మ‌రో ఛాన్స్ లేకుండా పోయింది. ఒక‌వేళ ఇంట‌ర్ ఫ‌ష్ట్ ఇయ‌ర్ లో గ‌నుక త‌ప్పి పోతే రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లతో పాటు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *