తాడిపత్రిలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి హల్ చ‌ల్

పోలీస్ స్టేషన్ వద్ద స్నానం చేసిన నేత

అనంత‌పురం జిల్లా : తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న తాడిప‌త్రిలో హ‌ల్ చ‌ల్ చేశారు. పోలీసుల ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా తాడిపత్రిలో స్వేచ్ఛగా తిరిగేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.పెద్దారెడ్డి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, కేసులు నమోదు చేయాలని తన అనుచరులతో ఫిర్యాదులు చేయించారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.

ఆ ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేశారు. ఆపై రోడ్డు పక్కన స్నానం చేసి పోలీసులపై ఆరోపణలు చేశారు. వారు కావాల‌నే పెద్దారెడ్డిపై కేసులు న‌మోదు చేయ‌డం లేద‌ని ఆరోపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో గ‌త్యంత‌రం లేక పోలీసులు ఒత్తిడిని త‌ట్టుకోలేక‌ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *