నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొడాలి నాని
విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆయన కొడుకు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లను ఏకి పారేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మాజీ సీఎం , తమ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తండ్రీ కొడుకులకు చచ్చేంత భయం అంటూ ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరికీ జగన్ గొడ్డలిగా కనిపించడంలో తప్పు లేదన్నారు.
చంద్రబాబుకు జగన్ సరిగ్గా ఆ గొడ్డలిలాగే కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని. అందులో తప్పేమీ లేదన్నారు . ఆ గొడ్డలి పరశురాముడి గొడ్డలి అని ఆ మాత్రం తెలుసుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు జగన్ చేతికి ఆ పరశురాముడి గొడ్డలిని ఇవ్వబోతున్నారని చెప్పారు మాజీ మంత్రి. ఆ గొడ్డలితో ఆయన మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా నరికి భూమిలో పాతిపెడతారని, ఆ విషయం తెలుసకుంటే మంచిదని తీవ్రంగా హెచ్చరించారు.






