యువ‌త వ్యాయామంపై దృష్టి పెట్టాలి

Spread the love

పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా

ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యోగా డే సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. యువ‌త ప్ర‌తి రోజూ యోగాను ప్రాక్టీస్ చేయాల‌ని సూచించారు. గ‌తంలో త‌న‌కు మ‌ధుమేహం ఉండేద‌ని అన్నారు. దీంతో మే 2020 నుండి ఇప్పటి వరకు నా జీవనశైలిలో నేను భారీ మార్పులు చేసుకున్నానని తెలిపారు. నా నిద్ర వేళలను సరిచేసుకోవడంతో పాటు, నీటి వినియోగం, ఆహారపు అలవాట్లు , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి సారించాన‌ని చెప్పారు అమిత్ చంద్ర షా.

ఇలా మార్పు చేసుకోవ‌డం వ‌ల్ల నా శ‌రీరంలో అనుకోని మార్పులు చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. దీని వ‌ల్ల త‌న‌కు ఎంతో మేలు జ‌రిగింద‌న్నారు. నేడు, నేను ఎలాంటి అల్లోపతి మందులు లేదా ఇన్సులిన్ అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు అమిత్ చంద్ర షా. యువత తమ శరీర ఆరోగ్యం కోసం రోజుకు రెండు గంటల వ్యాయామం, మెదడు విశ్రాంతి కోసం ఆరు గంటల నిద్రను కేటాయించాలని పిలుపునిచ్చారు. తాజాగా షా చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

  • Related Posts

    పాత కేసుల ట్రేసింగ్ పై ఫోక‌స్ పెట్టాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగు పులుముతున్నారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు.…

    మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    Spread the love

    Spread the loveఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచు కోవాలని స్పష్టం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *