రేప‌టి నుంచి పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

Spread the love

మూడు రోజుల పాటు కీల‌క స‌మావేశాలు

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా : వైసీపీ చీఫ్‌, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి జూన్ 23 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ క‌డ‌ప జిల్లా లో ప‌ర్య‌టించ‌నున్నారు. టూర్ లో భాగంగా పులివెందుల‌కు చేరుకుంటారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు .24వ తేదీ వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నార‌ని వైసీపీ కేంద్ర పార్టీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా వైఎస్ జగన్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో కోటిన్నరకు పైగా దేవాలయానికి మంజూరు చేశారు.

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా నిధులతో మరికొన్ని పనులు చేప‌ట్టారు. దాతల విరాళాలు కలుపుకుని రూ. 2.5 కోట్లతో దేవాలయ పునః ప్రతిష్ట కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి. అనంత‌రం మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్ నిర్వ‌హిస్తారు. 25వ తేదీ ఉదయం తిరిగి తాడేప‌ల్లిగూడెంకు చేరుకుంటారు.

  • Related Posts

    సోదరుడు విజయ్‌కి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

    Spread the love

    Spread the loveత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించాల‌ని ఆకాంక్ష‌ అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోద‌రుడంటూ పేర్కొన్నారు. జూన్ 22 విజ‌య్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా…

    జూన్ 26 వరకు ఏపీలో భారీ వర్ష సూచన

    Spread the love

    Spread the loveహెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌ట‌న అమరావ‌తి : ఏపీ వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే రోజుల్లో ఏపీలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జూన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *