25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సిట్
ఉత్తర ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్పట్లో అద్వానీ సారథ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేపట్టారు దేశ వ్యాప్తంగా ఆనాడే దాదాపు రూ. 1400 కోట్లు పోగు చేశారు. ఇప్పటి వరకు వీటికి సంబంధించి లెక్కా పత్రం లేకుండా పోయింది. తాజాగా అయోధ్య మందిర నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందని గతంలో ఆరోపణలు వచ్చాయి. హిందూ బంధువులు కొందరు దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. చివరకు కేసుల నమోదు దాకా వెళ్లింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసుకు సంబంధించి తాజాగా అప్ డేట్ వచ్చింది. అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో 150 మంది అనుమానితులను గుర్తించింది సిట్.
దాదాపు 25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐదుగురు ప్రధాన నిందితులు లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం తీసుకున్నారు. అలాగే ఒక మహిళా భక్తురాలు మందిరంలో తన ఆభరణాలను విరాళంగా ఇచ్చిన కేసు కూడా దర్యాప్తు జరుగుతోంది. జూన్ 7న రామ మందిరంలో రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల డబ్బులు దొంగిలించారని యూపీ మాజీ మంత్రి పవన్ పాండే ఆరోపణలతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.








