అవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కామెంట్స్
అమరావతి : తన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పట్ల స్పందించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆయన మాజీ ఎంపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలి పోతున్నడంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. తన సోదరుడు అని చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు.
రేవులో తాడి చెట్టు మాదిరి పెరిగావు ఇంగిత జ్ఞానం మాత్రం లేదని ఫైర్ అయ్యారు ఎంపీ. ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి , ఏపీ, తెలంగాణ రాష్ట్ర సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, ఎ. రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినా తాను ఎక్కడా సెంటు భూమి ఆక్రమణకు కాల్పడలేదని పేర్కొన్నారు. మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలు, విమర్శలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, KA పాల్ మాత్రమేనని పేర్కొన్నారు. నీ గురించి బెజవాడ ప్రజలందరికీ తెలుసన్నారు.






