తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే

పునరావృతమవుతాయని నితిన్ నబిన్ జోస్యం

హైద‌రాబాద్ : ఆరు హామీల’ను నెరవేర్చక పోవడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం ఆరోపించారు. 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ తరహా ఫలితాలే వస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధికి చెందిన బూత్ స్థాయి పార్టీ అధ్యక్షులను ఉద్దేశించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రసంగించారు, మోదీ ప్రభుత్వం చొరవతో కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీలోనే కొత్త వందే భారత్ రైళ్లు తయారవుతాయని నబిన్ తెలిపారు. గతంలోని యూపీఏ ప్రభుత్వం ‘నేల బిడ్డ’, మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించిందని ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో రూ. 400 కోట్లతో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని నబిన్ వెల్లడించారు. అలాగే అంబర్‌పేటలో కీలకమైన ఫ్లైఓవర్ నిర్మాణం (సుమారు రూ. 400 కోట్లు), బీబీనగర్‌లో ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రి, అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ (రూ. 700 కోట్లు), ఎంఎంటీఎస్ (MMTS) ఫేజ్-2కు నిధులు, రాష్ట్రంలో 100 కి.మీ రైలు మార్గం వంటి అనేక ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకుని ప్రజల సొమ్మును దోచుకుందని నబిన్ విమర్శించారు.

  • Related Posts

    మంత్రి ఆధ‌వ్ అర్జున్ పేరు చెప్పి టోక‌రా

    చెన్నై : టీవీకే మంత్రి ఆధవ్ అర్జునగా నటిస్తూ ఎమ్మెల్యే నుంచి రూ. 8 కోట్లు ఆశించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. మంత్రి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడిని సృష్టించి, తమళగ వెట్రి కళగం (TVK) వెల్లూరు ఎమ్మెల్యే…

    టీవీకే డీలిమిటేష‌న్ తీర్మానం ఒప్పుకోం : అన్నాడీఎంకే

    చెన్నై : అన్నాడీఎంకే చీఫ్ ప‌ళ‌నిస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)పై TVK తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ వ్య‌తిరేకిస్తోంద‌ని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్‌కు AIADMK మద్దతు ఇస్తున్న‌ట్లు తెలిపారు. రాజకీయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *