కల్పిస్తామని ప్రకటించిన నారా లోకేష్
తిరుపతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. తిరుపతి లోని శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ద్వారా 75 వేల జాబ్స్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రోజు రోజుకు టెక్నాలజీలో కీలకమైన మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు మారాలని సూచించారు. లేకపోతే వెనుకబడి పోతామని పేర్కొన్నారు . ఇప్పుడు కేవలం డిగ్రీ ఉంటే సరిపోదన్నారు. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, టెక్నాలజీకి తగ్గట్టు మారడం, లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండేలా మన స్టూడెంట్స్ ని రెడీ చేయడం చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (SIU) సరిగ్గా అలాంటి ఆలోచనతోనే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
.దీని ద్వారా మరో 75 వేల ఉద్యోగాలు తీసుకు రావాలన్నది నా టార్గెట్ అని ప్రకటించారు నారా లోకేష్. 2029కల్లా దానిని సాకారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 31 దేశాల నుంచి 200 కంపెనీలు ఇప్పటికే ఇక్కడున్నాయని తెలిపారు. మీరిక్కడ చేస్తున్నది నిజంగా మ్యాజిక్ లాంటిది. ఇండియా ఏంటో చూపించడానికి మీరొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. గత 20 ఏళ్లుగా దీన్ని అచీవ్ చేసినందుకు శ్రీని రాజు కి, రవి సన్నా రెడ్డికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ఎంతో డెడికేషన్ కావాలి. కలలు కనడం చాలా ముఖ్యం. శ్రీని రాజు పెద్దగా కలలు కనరని నా ఫీలింగ్, ఎందుకంటే ఆయన ప్రతిరోజూ ఆ కలలోనే బతుకుతున్నారని ప్రశంసలు కురిపించారు. ఆయన పెద్ద డ్రీమర్, దాన్ని సాధించడానికి ఆయన మా అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారని తెలిపారు.















