నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు

నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి రావడం అద్భుత పరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ చెప్పారు. త నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల పరిధిలోని అయ్యంబొట్లపల్లె గ్రామం వెలుపల మొదలు పెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు. కాకతీయ రాణి రుద్రమదేవి వద్ద సేనాపతిగా పని చేసిన మల్లికార్జున నాయకుడు – నాటి ధాన్య కటకం, నేటి ఆమరావతిలోని బుద్ధ దేవునికి కృష్ణా నది తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు సదరు శాసనం తెలియ జేస్తున్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు.

ఈ అంశంపై శ్రీ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘మన చారిత్రక వారసత్వ సాక్ష్యాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తోన్న పురావస్తు శాస్త్రవేత్తలకు, వారికి సహకరిస్తున్న రాష్ట్ర అటవీశాఖ సిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయి. అంతేకాదు నేటి ఈ అమరావతిలోనే క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు బౌద్ధం ఆనవాళ్లు, అమరావతి స్తూపం ఉన్నట్టు ఆధారాలు లభించాయి. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి శతాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందినట్టు తెలుస్తోంది. మన వారసత్వ సంపద గుర్తింపుతో పాటు సంరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో మరింత లోతైన పరిశోధనలకు అటవీశాఖ తరఫున భవిష్యత్తులోనూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. వన్య ప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన ప్రాచీన వైభవాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’న్నారు.

  • Related Posts

    సమాజ విధ్వంసకులకు జ‌గ‌న్ రెడ్డి అండ‌

    అమ‌రావ‌తి : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ ఉద్దేశ పూర్వకంగా రోజూ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో…

    ఏపీలో వేగ‌వంతంగా ప‌క్కా గృహాల నిర్మాణం

    అమ‌రావ‌తి : 2024 తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్కాగృహాల నిర్మాణాలను వేగవంతం చేసిందని మంత్రి పార్ధసారధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి కేంద్రానికి పంపించి మంజూరు చేయించుకోవడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *