గాన కోకిల‌ ఎస్. జానకి మృతి బాధాక‌రం : జ‌గ‌న్

అమ‌రావ‌తి : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన జాన‌కి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.

తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్తించిన‌ట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని పేర్కొన్నారు.

  • Related Posts

    సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్ర‌మాదం : సీఎం

    అమరావ‌తి : ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియా ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇదే వ్య‌స‌నంగా మారితే ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌ని పేర్కొన్నారు. సామాజిక మాధ్య‌మాలలోనే యువ‌త ఎక్కువ‌గా గ‌డుపుతున్నార‌ని…

    వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమం, చేన‌త శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈసంద‌ర్బంగా వియ‌త్నాంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై ఆరా తీశారు. ఈ మేర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *