మోహన్ బాబు ఫిర్యాదు మేరకు
తిరుపతి – మోహన్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు నటుడు మంచు మనోజ్ కు. తిరుపతిలో తన ఇంట్లో ఉన్న మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు. భాకరా పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి 11.15 గంటల సమయంలో తనను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను తన సిబ్బందితో లేక్ వ్యాలీ రెస్టారెంట్ లో బస చేశారు. తన పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ కు రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బసచేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్కు పిలిచారన్నారు.
తాను స్టేషన్ కు వచ్చేసరికి ఎస్సై లేరని విమర్శించారు. ఎక్కడికెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే బైఠాయించారు. అనంతరం సీఐ ఇమ్రాన్బాషాతో ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా కుటుంబ వివాదంలోమోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.