Monday, April 21, 2025
HomeDEVOTIONALఅదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు

అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు

లడ్డూ కౌంటర్ లో టీటీడీ

తిరుమల – తిరుమలలోని లడ్డూ కౌంటర్ లో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments