Saturday, April 19, 2025
HomeNEWSహైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్

హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్

తెలంగాణ ప్ర‌భుత్వంతో ఐటీ దిగ్గ‌జ కంపెనీల ఒప్పందం

జ‌పాన్ – జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి . హైద‌రాబాద్ లో రూ. 10,500 కోట్ల‌తో ఏఐ డేటా సెంట‌ర్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి టెక్ దిగ్గ‌జాలు ఎన్టీటీ డేటా, నెయిసా నెట్ వ‌ర్క్స్ . ఈ మేర‌కు సీఎం బృందంతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఏఐ డేటా సెంట‌ర్ క్ల‌స్ట‌ర్ ను ఏర్పాటు చేస్తామ‌ని, దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. 400 మెగావాట్ల డేటా సెంటర్, 25000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటింగ్ సదుపాయాలు క‌లుగుతాయి. తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రాజధానిగా మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు సీఎం.

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో ఉన్నత స్థాయి పెట్టుబడి రోడ్‌షోను నిర్వహించింది, రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను హైలైట్ చేస్తూ , దాని వృద్ధిలో భాగస్వామ్యం కావడానికి జపాన్ వ్యాపారాలను ఆహ్వానించింది. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని, కంపెనీలు స్థాపించాల‌ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. లైఫ్ సైన్సెస్, GCCలు, ఎలక్ట్రానిక్స్, EVలు , ఇంధన నిల్వ, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్, AI డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి ప్రాధాన్యతా రంగాలలో పెట్టుబ‌డి పెట్టేందుకు తెలంగాణ ప్ర‌పంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ప్రతిభ , స్పష్టమైన విధానాలను అందిస్తుంద‌న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments