Friday, June 13, 2025
HomeNEWSNATIONALఅహ్మ‌దాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం

అహ్మ‌దాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం

ప‌లువురు దుర్మ‌ర‌ణం..మాజీ సీఎం రూపాణీ

గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో గురువారం మ‌ధ్యాహ్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలి పోయింది. ఈ ఫ్లైట్ అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ కు వెళుతుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. టాకేఫ్ తీసుకుంటున్న కొద్ది సేప‌టికే న‌గ‌రంలోని మేఘా న‌గ‌ర్ లో ఇళ్ల‌పై కూలి పోయింది. ఈ విమానంలో 242 మంది ప్ర‌యాణిస్తున్నారు. ఇందులో జ‌ర్నీ చేస్తున్న మాజీ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపాణి దుర్మ‌ర‌ణం చెందిన‌ట్లు ప్ర‌క‌టించింది కేంద్రం. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఫ్లైట్ కూలి పోవ‌డంతో అర్ధాంత‌రంగా అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్టును మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ప‌లువురు ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఫ్లైట్ కూలి పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఎవరైనా కుట్ర ప‌న్నారా అన్న కోణంలో కూడా ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఎయిర్ ఇండియా.

ప్ర‌స్తుతం ఫ్లైట్ లో ఎవ‌రెవ‌రు ప్ర‌యాణం చేస్తున్నార‌నే దానిపై పూర్తి వివ‌రాలు సేక‌రిస్తున్నామ‌ని తెలిపింది. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని పేర్కొంది. అయితే జ‌నావాసాల మీద కూలి పోవ‌డంతో భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు విమాన‌యాన సిబ్బంది. దీనిపై అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి . ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments