Sunday, April 20, 2025
HomeNEWSANDHRA PRADESHపోలీస్ శాఖకు పూర్వవైభవం తెస్తాం

పోలీస్ శాఖకు పూర్వవైభవం తెస్తాం

హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి

అమ‌రావ‌తి – రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు 2024- 25 బడ్జెట్ లో రూ.8,495 కోట్లు కేటాయించారని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గత ప్రభుత్వ పాలనలో అర కొర సౌకర్యాలతో పోలీసులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపట్టిందన్నారు. పోలీసు బలగాల ఆధునీకరణ, మౌలిక వసతుల కోసం ఇప్పటికే రూ.62 కోట్లు నిధులు విడుదల అయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరంలో కొత్తగా 4 స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని పట్టి పీడించిన మాదక ద్రవ్యాలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. అందుకే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు.

డ్రగ్స్ కేసుల సత్వర పరిష్కారానికి 13 ఫాస్ట్ ట్రాక్ NDPS ఏర్పాటు చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విద్యార్థులను మత్తుకు బానిసలు కాకుండా ఉంచేందుకు ఉన్నత విద్యా సంస్థల్లో 3,172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని చెప్పారు వంగ‌ల‌పూడి అనిత‌.

సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 300 మంది సిబ్బందితో ఉమెన్ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments