Saturday, May 24, 2025
HomeDEVOTIONALశ్రీ‌వారిని ద‌ర్శించుకున్న నారా కుటుంబం

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న నారా కుటుంబం

అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌కు రూ. 44 ల‌క్ష‌లు విరాళం

తిరుమల – ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కుటుంబం శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుంది. ఇవాళ త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్ పుట్టిన రోజు. ప్ర‌తి ఏటా స్వామి వారి సన్నిధికి రావ‌డం, ద‌ర్శించు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. బాబుతో పాటు భువ‌నేశ్వ‌రి, మంత్రి నారా లోకేష్, హెరిటేజ్ ఎండీ నారా బ్రాహ్మ‌ణి, కొడుకు నారా దేవాన్ష్ క‌లియుగ దేవుడైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.

ముందుగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఇతర కుటుంబ సభ్యులకు మహా ద్వారం వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్న ప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను చంద్రబాబు నాయుడి కుటుంబం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇచ్చారు.

ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, పలువురు టీటీడీ బోర్డు సభ్యులతో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments