Sunday, June 15, 2025
HomeNEWSANDHRA PRADESHత్వ‌ర‌లో అన్న‌దాత సుఖీభ‌వ - సీఎం

త్వ‌ర‌లో అన్న‌దాత సుఖీభ‌వ – సీఎం

త‌ల్లికి వందనం ప‌థ‌కంతో సంతృప్తి

అమ‌రావ‌తి – ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని అన్నారు. పార్టీ కోసం ప‌ని చేసే వారికి త‌ప్ప‌కుండా ప్ర‌యారిటీ ఉంటుంద‌న్నారు. ఈనెల 23 నుంచి ఇంటింటికీ తొలి అడుగు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నామ‌ని అన్నారు. దీని ద్వారా ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. జూలై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామ‌న్నారు.

కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దుతామ‌ని అన్నారు సీఎం. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు చాలా కష్టపడ్డారని కొనియాడారు. ఎమ్మెల్యేలు కూడా ప్రతి రోజూ పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలన్నారు. ప్రజలతో నిత్యం కలుపుగోలు తనంతో మెలగాలని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. విశాఖపట్నంలో ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహిస్తున్నామ‌ని, దీనిని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. ఇప్పటికే 2.21 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇది రాష్ట్ర చ‌రిత్ర‌లో ఓ రికార్డ్ అని పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. మూడు రోజులు పాల్గొంటే సర్టిఫికేట్ ఇస్తామ‌న్నారు. యోగా జీవితంలో భాగం కావాలి. హెల్తీ, వెల్దీ, హ్యాపీ సమాజంగా మారడానికే దీనికి శ్రీకారం చుట్టామ‌న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments