Sunday, April 20, 2025
HomeSPORTSతెలుగు తేజం గ‌ర్వ కార‌ణం

తెలుగు తేజం గ‌ర్వ కార‌ణం

అభినందించిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – ర్యాపిడ్ ఛాంపియ‌న్ షిప్ టైటిల్ ను కైవ‌సం చేసుకున్న తెలుగు తేజం కోనేరు హంపిని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. న్యూయార్క్ లో జ‌రిగిన ఫైన‌ల్ పోరులో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకంద‌ర్ ని ఓడించి విజేత‌గా నిలిచింది. 2019లో జార్జియాలో జ‌రిగిన ఈవెంట్ లో కూడా స‌త్తా చాటారు హింపి. 37 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఆమె 11 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.

ఇదిలా ఉండ‌గా పురుషుల విభాగంలో ర‌ష్యాకు చెందిన 18 ఏళ్ల వోలోడ‌ర్ ముర్జిన్ టైటిల్ గెలుపొందాడు. ముర్జిన్ 17 సంవత్సరాల వయస్సులో టైటిల్‌ను సాధించిన నోడిర్బెక్ అబ్దుసట్టోరోవ్ తర్వాత ఫైడ్ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా రెండవ యువకుడు కావ‌డం విశేషం.

ఇటీవల సింగపూర్‌లో జరిగిన క్లాసికల్ ఫార్మాట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఏపీకి చెందిన త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డిన డి గుకేశ్ దొమ్మ‌రాజు చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత హంపీ సాధించిన ఈ ఘనత భారత చెస్‌కు సంచలనాత్మక సంవత్సరాన్ని అందించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments