Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHసీఎం వ‌ర‌ల్డ్ ఫోటోగ్ర‌ఫీ శుభాకాంక్ష‌లు

సీఎం వ‌ర‌ల్డ్ ఫోటోగ్ర‌ఫీ శుభాకాంక్ష‌లు

స్వ‌యంగా ఫోటీ తీసిన చంద్ర‌బాబు

గుంటూరు జిల్లా – ప్ర‌పంచ ఛాయా చిత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఫోటోగ్రఫీ శుభాకాంక్ష‌లు తెలిపారు. కెమేరా స్వ‌యంగా చేత‌ప‌ట్టి స్వ‌యంగా ఫోటో జ‌ర్న‌లిస్టును ఫోటో తీశారు. ఆగ‌స్టు 19న వ‌ర‌ల్డ్ ఫోటో గ్ర‌ఫీ దినోత్స‌వం.

ఉండవల్లి లోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పని చేస్తున్న ఫోటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సిఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమేరాను తీసుకుని స్వయంగా సిఎం ఫోటోలు క్లిక్ మనిపించడంతో జ‌ర్న‌లిస్టులు సంతోషానికి లోన‌య్యారు.

మీడియాలో ఫోటోగ్రఫీ విభాగంలో విధులు చాలా కష్టతరమని అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఈ రంగంలో ప్రతిభ చూపుతున్న వారిని అభినందించారు.

నాణ్యమైన సేవలతో ఫోటోగ్రఫీ రంగం బాగుండాలని సిఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments