Tuesday, June 17, 2025
HomeNEWSANDHRA PRADESHప‌నితీరు మార్చుకోక పోతే ప‌క్క‌న పెడ‌తా

ప‌నితీరు మార్చుకోక పోతే ప‌క్క‌న పెడ‌తా

ఎమ్మెల్యేల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

అమ‌రావ‌తి – ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను. చుర‌క‌లు అంటించారు. ఎమ్మెల్యేల ప‌నితీరుపై తాను సర్వే చేయించాన‌ని చెప్పారు. చాలా మంది ఇంకా ప‌నితీరు మార్చుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ సుతిమెత్త‌గా హెచ్చ‌రించారు.
ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్ అంటా లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాన‌ని అన్నారు. కార్య‌క‌ర్త‌లే మ‌న‌కు బ‌లం..ప్ర‌జ‌లే బ‌ల‌గం..వారితోనే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కంతో మ‌న‌కు అధికారాన్ని క‌ట్ట‌బెట్టార‌ని, ఈ విష‌యంపై దృష్టి సారించాల‌న్నారు సీఎం. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటాన‌ని అన్నారు. వాళ్ల మద్దతు గ‌నుక లేకపోతే పక్కన పెడతానంటూ హెచ్చ‌రించారు.
ఎక్కడికి వెళ్లినా ఏపీలో ఒక భూతం ఉంది.. అది మళ్లీ లేస్తే ఎలా అని అంతా భయపడుతున్నారంటూ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇదే స‌మ‌యంలో దేశంలో ఎక్క‌డా లేనివిధంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున క్యాడ‌ర్ ఉంద‌న్నారు. త‌న‌కు కార్య‌క‌ర్త‌లే ప్రాణ‌మ‌ని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments