Tuesday, April 22, 2025
HomeDEVOTIONALశ్రీ‌వారి స‌న్నిధిలో చంద్ర‌బాబు నాయుడు

శ్రీ‌వారి స‌న్నిధిలో చంద్ర‌బాబు నాయుడు

స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

తిరుమల: తిరుమ‌ల‌లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, సతీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి తో పాటు కుటుంబీకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు.

అంత‌కు ముందు ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగుర వేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజ పటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments