సీఎం న్యూ ఇయర్ గ్రీటింగ్స్
అమరావతి – తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోందని స్పష్టం చేశారు. ఏపీని ఐటీ , పారిశ్రామిక హబ్ గా మారుస్తామన్నారు.
న్యూ ఇయర్ సందర్బంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కేవలం ఆరు నెలల్లోనే సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలను ఆవిష్కృతం చేశామన్నారు. పేదవాడి భవిష్యత్కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచామని తెలిపారు.
ప్రతి ఇంట కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు. ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపామన్నారు. మీ ప్రయాణం సాఫీగా సాగాలని రాష్ట్రంలో రహదారులన్నీ గుంతులు లేకుండా చేస్తున్నామని చెప్పారు.
కొత్త ప్రభుత్వ పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికామన్నారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందన్నారు. ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు.