శ్రీకారం చుట్టిన కమిషనర్ రామచంద్ర మోహన్
విజయవాడ – ఏపీ దేవాదాయ శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు కమిషనర్ రామచంద్ర మోహన్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దేవాలయాల్లో క్యూలైన్లలో మౌలిక వసతులు, అన్నప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయో, భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాలపై ఎప్పటికప్పుడు భక్తుల నుంచి సమాచారం సేకరించేందుకు, అదే విధంగా తనిఖీలు చేసేందుకు దేవాదాయ శాఖ పలు చర్యలు చేపట్టింది. నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలు పరిశీలించేందుకు , తనిఖీ చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో 22 దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించారు.
సింహాచలం దేవస్థానం, కనక మహాలక్ష్మి అమ్మ వారి ఆలయం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, తలుపులమ్మ దేవస్థానం, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఈ విధంగా ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అంతే కాకుండా రాష్ట్రంలోని 22 దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ను నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.