Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHవిప‌త్తు నిర్వ‌హ‌ణ‌పై మంత్రి స‌మీక్ష

విప‌త్తు నిర్వ‌హ‌ణ‌పై మంత్రి స‌మీక్ష

ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేయాలి

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర హొం , విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖా మంత్రి వంగ‌ల‌పూడి అనిత విప‌త్తు నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఏపీ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ రోణంకి కూర్మ‌నాథ్ హాజ‌ర‌య్యారు.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన ఆదేశాలు ఇచ్చారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.

ఇదిలా ఉండ‌గా నైరుతీ బంగాళా ఖాతంలో ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంద‌ని ఏపీ విప‌త్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

రెండు రోజుల్లో అల్ప పీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతోందని వెల్లడించారు. మరోపక్క ఆవర్తనం నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు ఎండీ.

దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో (12,13,14 తేదీల్లో) రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రోణంకి కూర్మ‌నాథ్.

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments