ఎక్స్ లో రిలీజ్ చేసిన మంత్రి
అమరావతి – ఏపీలో ఇంటర్ ఫలితాలను విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం తొలిసారిగా వాట్సాప్ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు . విద్యార్థులు తమ ఫలితాలను ఆన్లైన్లో https://resultsbie.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి “Hi” మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చని తెలిపారు.
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందన్నార. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులకు 83 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు కావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ , ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతం నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణం అన్నారు.
ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకండి. దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామన్నారు.