ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్
అమరావతి – రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. దాదాపు 2.70 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. వీటిని ఎప్పుడూ భర్తీ చేస్తారో తెలియడం లేదన్నారు. ఏడాదిలో బాబు సాధించిన ప్రగతి రూ.17 వేల కోట్ల విద్యుత్ బిల్లుల భారం తప్పా ఒరిగింది ఏమీ లేదన్నారు. సర్దుబాటు పేరుతో రెండు సార్లు భారం మోపారంటూ మండిపడ్డారు. ఇదే ఆయన సాధించిన ఘనత అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సాధించిన ప్రగతి అప్పులు తీసుకోవడం తప్ప ఏం చేశారంటూ ప్రశ్నించారు.
ఏడాదిలో దాదాపు లక్ష కోట్లు అప్పు తెచ్చారు. గతంలో జగన్ 6 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇద్దరు కలసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇక అమరావతి పేరుతో కూడా దాదాపు రూ.80 వేల కోట్లు అప్పులు తెస్తున్నారని అన్నారు. ఇన్ని అప్పులు ఎందుకు అని అడుగుతున్నాం. ఈ అప్పులు ఎలా తీరుస్తారు అని నిలదీశారు.బీజేపీ మోసం చేస్తుంటే బాబు నోరు మెదపడం లేదన్నారు. ప్రత్యేక హోదా హామీ ఏమయ్యింది అని అడిగే ధైర్యం బాబు ,పవన్ కి లేదన్నారు.
చంద్రబాబు, జగన్,పవన్ ముగ్గురు బీజేపీకి తొత్తులుగా మారి పోయారంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి.. ఒకరిది అక్రమ పొత్తు, మరొకరిది సక్రమ పొత్తు. ఇదే కడప జిల్లాలో ఇచ్చిన కడప స్టీల్ ప్లాంట్ హామీ ఇంతవరకు నెరవేరలేదన్నారు. బాబు ఏడాది పాలన అరచేతిలో వైకుంఠం, 3D గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీకి మద్దతు విరమించుకోవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రానికి ప్రత్యామ్నాయం అన్నారు.