ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. గత మార్చి నెలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఎ.ఎస్.శ్రీ కృష్ణ శేషాచలం దీక్షితులు, ఎస్వీ వేద విశ్వవి ద్యాలయంలోని వైఖానస ఆగమ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పరాశరం భవ నారాయణాచార్యులు, చెన్నైకు చెందిన పీ.కే.వరదన్ భట్టాచార్యార్, గోవిందరాజ స్వామి దేవాలయంలోని సంభావన అర్చకులు ఏ.అనంతశయన దీక్షితులు, మాజీ అర్చకులు నర సింహాచార్యులను నూతన ఆగమ సలహా కమిటీలో సభ్యులుగా నియమించడం జరిగిందని వెల్లడించారు టీటీడీ ఈవో జె. శ్యామలరావు. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు కొనసాగనుందని స్పష్టం చేశారు.