Saturday, May 24, 2025
HomeDEVOTIONALఅశ్వ వాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం

అశ్వ వాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం

ఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి – తిరుపతిలోని శ్రీ కోదండ రామ స్వామి వారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఎనిమిదో రోజు స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యు పాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.

వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవోలు గోవిందరాజన్, నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెండెంట్‌ ముని శంకర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments