Sunday, April 20, 2025
HomeDEVOTIONALతిరుమ‌ల ఆల‌యాల్లో దీపావ‌ళి ఆస్థానం

తిరుమ‌ల ఆల‌యాల్లో దీపావ‌ళి ఆస్థానం

ఘ‌నంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ

తిరుప‌తి – తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండ రామ స్వామి వారి ఆల‌యాల్లోదీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వ‌హించారు.

శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మ వారి ఆలయం నుండి సాయంత్రం నూతన వస్త్రాలు, దీపాలు తీసుకు వచ్చి బాలాలయంలోని స్వామి వారికి సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించారు.

శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి దీపావ‌ళి ఆస్థానం ఘ‌నంగా నిర్వహించారు.

రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండ రామస్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమావాస్య నాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహన సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆల‌య‌ డెప్యూటీ ఈవోలు శాంతి, నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments