బెంగళూరు తొక్కిసలాట ఘటనపై
భారత మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీకి షాక్ తగిలింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్బంగా బెంగళూరులో తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆర్సీబీతో పాటు కర్నాటక క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రియల్ ఫైటర్స్ ఫోరం చీఫ్ వెంకటేష్ కబ్సన్ పార్క్.
ఇదిలా ఉండగా RCBపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కోహ్లీపై కేసు నమోదు చేయడం సాధ్యమా? కాదా? అనే దిశగా యోచిస్తున్నారు పోలీసులు . మరో వైపు కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది ఈ ఘటనపై. దీనికి ప్రభుత్వ నిర్వాకమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు మంగళవారం లోగా పూర్తి నివేదికను అందించాలని సర్కార్ కు నోటీసు జారీ చేసింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ , హోం శాఖ మంత్రి జి. ఈశ్వరప్ప తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రులు కుమార స్వామి, జి. కిషన్ రెడ్డితో పాటు ఎల్ఓపీ నాయకుడు అశోక.