Tuesday, April 8, 2025
HomeNEWSANDHRA PRADESHపెట్టుబ‌డిదారుల‌కు భారీగా రాయితీలు

పెట్టుబ‌డిదారుల‌కు భారీగా రాయితీలు

క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు

దావోస్ – సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు దావోస్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో స‌మావేశం అయ్యారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చ‌ర్చ‌లు జ‌రిపారు. గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీపై స‌ద‌స్సులు కొన‌సాగాయి. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తో ములాఖ‌త్ అయ్యారు.

వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్-సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై విస్తృతంగా చ‌ర్చించారు.

బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివ‌రించారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఏపీలో పెట్టుబ‌డి పెట్టే ఇన్వెస్ట‌ర్ల‌కు భారీ ఎత్తున రాయితీలు క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం 15 రోజుల్లోనే ప‌ర్మిష‌న్స్ ఇస్తామ‌ని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments