పోతూ పోతూ టైటాన్స్ కోలుకోలేని షాక్
గుజరాత్ – అహ్మదాబాద్ లోని స్వంత మైదానంపై గ్రాండ్ విక్టరీ నమోదు చేయాలని భావిస్తున్న గుజరాత్ టైటాన్స్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్ . శుభ్ మన్ గిల్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆ జట్టు టాప్ ఆర్డర్ ను నమ్ముకుంటూ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లోకి రావాలని ఆశించింది. కానీ ఆశించినట్టుగా జరగలేదు. అందుకే మెగా టోర్నీకి అంత ఆదరణ.
గత మ్యాచ్ లో 200 టార్గెట్ ను ఛేదించ లేక చతికిల పడింది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ లో కూడా చేతులెత్తేసింది. తాజాగా గిల్ కు ప్రమోషన్ లభించింది. ఆ సంతోషం కొంత సేపు కూడా నిలవకుండా చేశారు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు. మెగా టోర్నీలో భారీ స్కోర్ తో దంచి కొట్టింది. ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 230 రన్స్ చేసింది. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించింది సీఎస్కే.
ఆతిథ్య జట్టును కేవలం 147 పరుగులకే కట్టడి చేసింది. దీంతో 83 పరుగుల తేడాతో ఓడించింది. కాగా విజయంతో వీడ్కోలు పలికింది. మరో వైపు స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే మరో నాలుగు నెలల్్లో తన ప్రకటన చేస్తాడని భావిస్తున్నారు.
మరో వైపు చెన్నై బౌలర్లు చుక్కలు చూపించారు గుజరాత్ టైటాన్స్ కు. గిల్ ను 13 రన్స్ కే కట్టడి చేశారు. బట్లర్ ను బోల్తా కొట్టించాడు. సాయి సుదర్శన్ ఒక్కడే రాణించాడు. తను 41 రన్స్ చేశాడు. రూథర్ ఫోర్డ్ డకౌట్ అయ్యాడు. షారుక్ ఖాన్ 19 రన్స్ చేశారు. రవీంద్ర జడేజా మరోసారి తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. గుజరాత్ కు భారీ షాక్ ఇచ్చాడు.