Saturday, May 24, 2025
HomeDEVOTIONALశ్రీవారిని ద‌ర్శించుకున్న‌ జస్టిస్ సంజీవ్ ఖన్నా

శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ జస్టిస్ సంజీవ్ ఖన్నా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థ..ప్ర‌సాదాలు

తిరుమల – మొదటిసారిగా తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య , వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా ఇష్థికఫాల్ స్వాగతం పలికారు.

స్వామి వారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష వస్త్రం కప్పారు అర్చ‌కులు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అటు తరువాత టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ ఛార్జ్ సీవీఎస్వో హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments