Thursday, June 19, 2025
HomeNEWSబ‌న‌క‌చ‌ర్ల‌పై బ‌ద్నాం చేస్తే ఎలా..?

బ‌న‌క‌చ‌ర్ల‌పై బ‌ద్నాం చేస్తే ఎలా..?

నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలుగు రాష్ట్రాల‌లో బ‌న‌చ‌ర్ల వివాదం మ‌రింత రాజుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. మ‌రింత ర‌క్తి క‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. జ‌గ‌న్ తో కేసీఆర్ దోస్తానా చేసింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. ఢిల్లీలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో రాయ‌ల‌సీమ‌కు గోదావ‌రి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నార‌ని, ఇందుకు సంబంధించిన మినిట్స్ త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని అన్నారు.

ఎవ‌రిని ఫూల్స్ చేసేందుకు ఇలాంటి చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. దీనిపై కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు మీడియా స‌మావేశంలో. 2019 వరకు ఇది రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందన్నారు. ఆనాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నాలుగుసార్లు సమావేశమై కెసీఆర్ రాయలసీమకు నీటి తరలిపునకు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

ఆ సమావేశం వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరించారని చెప్పారు రేవంత్ రెడ్డి. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పింది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. గోదావరి- బనకచర్ల విషయంలో 2016 లో కెసీఆర్, చంద్రబాబు మాట్లాడుకున్న అంశాల సాకుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతోందని చెప్పారు.

బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని కెసీఆర్ ఆనాడు మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఏపీ చేపట్టేది 200 టీఎంసీ ప్రాజెక్టు కాదు 300 టీఎంసీల కోసం అన్నారు. ఆనాడు కెసీఆర్ 400 టీఎంసీలు తీసుకోవచ్చని అంగీకరించారని చెప్పారు రేవంత్ రెడ్డి. మేం వాదనలకు వెళ్లదలచు కోలేదన్నారు. అందుకే తెలంగాణకు నష్టం జరగొద్దని జలశక్తి మంత్రిత్వశాఖకు పిర్యాదు చేశామ‌ని చెప్పారు. త‌మ‌ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించ లేద‌న్నారు. ఉన్నఫలంగా హరీష్ బకెట్లో బురద తీసుకుని మాపై చల్లాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పాపానికి కారకుడు మీ మామనే అంటూ కేసీఆర్ పై ధ్వ‌జ‌మెత్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments