సీఎం పుట్టిన రోజు సందర్బంగా వితణ
తిరుమల – సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ. 44 లక్షలు విరాళం అందజేశారు. ఏప్రిల్ 20వ తేదీతో బాబుకు 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్బంగా తిరుమల లోని తరిగొండ వెంబమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ రూ. 44 లక్షలు విరాళంగా అందించారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు.
ఈ సందర్భంగా అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సురేంద్ర, అన్నప్రసాదాల ప్రత్యేక అధికారి శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.