నమోదు చేయాలని ఆదేశించిన హైకోర్టు
ఢిల్లీ – హిందూ దేవతలను అవమానించారనే ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయూబ్ పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. 2013, 2014, 2015, 2022 సంవత్సరాలలో ప్రత్యేకించి హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని కించ పరిచేలా కామెంట్స్ చేస్తున్నారంటూ హిందూ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక తీర్పు చెప్పింది.
హిందూ దేవతలను అవమానించడం, సోషల్ మీడియాలో “భారత వ్యతిరేక భావాలను” వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలపై జర్నలిస్ట్ రాణా అయూబ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది రాణా అయూబ్ పై ఫిర్యాదు చేశారు. పిటిషన్ దాఖలు చేశారు.
వాస్తవాలు, పరిస్థితుల దృష్ట్యా, ఫిర్యాదు FIR అవసరం ఉన్న గుర్తించదగిన నేరాల కమిషన్ను వెల్లడిస్తుంది. సెక్షన్ 156(3) Cr.P.C కింద దరఖాస్తును సమర్పించడానికి అనుమతి ఉంది. ఫిర్యాదులోని విషయాలను FIRగా మార్చాలని, ఈ విషయాన్ని న్యాయంగా దర్యాప్తు చేయాలని దక్షిణ SHO సైబర్ పోలీస్ స్టేషన్ను ఆదేశించారు.