నిర్మాత దిల్ రాజు కామెంట్
హైదరాబాద్ – తాను నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ టార్చ్ బేరర్ కానుందని అన్నారు నిర్మాత, టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. శంకర్ దర్శకత్వంలో తీసిన ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తుందని జోష్యం చెప్పారు. విడుదల చేసిన ట్రైలర్ కు భారీ ఆదరణ లభిస్తోందని, జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుందన్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని, కోట్లు కొల్లగొట్టడం ఖాయమన్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్, పాటలు, టీజర్ అందరినీ పిచ్చెక్కించాయి. అందరి దృష్టి ఈ చిత్రం ట్రైలర్పైనే ఉంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి గేమ్ ఛేంజర్ ట్రైలర్ను విడుదల చేసి, మేకర్స్కు రెండు నిమిషాల క్రితం శుభాకాంక్షలు తెలిపారు.
2 నిమిషాల 43 సెకన్ల ట్రైలర్ రామ్ చరణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ యాక్షన్ ప్యాక్గా ఉంది. అవినీతిని బయటపెట్టే కలెక్టర్ రాంనందన్గా రామ్ చరణ్ స్టైలిష్గా పరిచయం అవుతున్నాడు. పేదల కోసం ఉద్దేశించిన బియ్యం, ఇతర వస్తువులను బ్లాక్ మార్కెట్ చేయడానికి అతను రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నాడు.
రామ్ నందన్ ఐఏఎస్ పాత్రలో రామ్ చరణ్ చాలా కూల్ గా కనిపించాడు. వెన్నెల కిషోర్, సునీల్లు పరిచయం అవుతున్నారు. బ్యూటీ కియారా అద్వానీ తన ఉనికిని చాటుకున్నారు. రామ్ చరణ్ అప్పన్నగా, అంజలి భార్యగా పరిచయం కాకముందే రామ్ చరణ్, కియారా అద్వానీల రొమాంటిక్ సన్నివేశాలు కనిపిస్తాయి.