అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు
విజయవాడ – ఏపీ బిషప్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా డాక్టర్ ముత్తా బత్తుల రత్నకుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయవాడ పున్నమి ఘాట్ లో బుధవారం సి.బి.ఎం. సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో ఏపీలోని 3 రీజియన్లకు చెందిన 300ల మందికి పైగా బిషప్ లు పాల్గొన్నారు. వీరంతా కలిసి ఏపీ బిషప్స్ కౌన్సిల్ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
2025 నుంచి 2030 వరకు అయిదు సంవత్సరాల పాటు డాక్టర్ ఎం. రత్నకుమార్ ఈ పదవిలో కొనసాగుతారు. కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ అధ్యక్షుడు రత్నకుమార్ మాట్టాడూతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతికి సి.బి.ఎం. సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజధానికి తమ సిబి.ఎం. ఏ విధంగా సహకరిస్తుందో తెలిపేందుకు త్వరలో ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తామని చెప్పారు .ఈ సందర్బంగా పూర్తి స్థాయిలో నివేదిక అందిస్తామని అధ్యక్షుడు డాక్టర్ ఎం. రత్నకుమార్ తెలిపారు. సర్వ మతాలకు కేటాయించినట్లు, సి.బి.ఎం. తరఫున అమరావతిలో 10 ఎకరాలు స్థలం కేటాయించాలని సీఎంని కోరనున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం మూడు రాజధానులతో పేరుతో తాత్సారం చేసిందని వాపోయారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక రాజధాని నిర్మాణం విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, ఇటీవలే కేంద్రం భారీ ఎత్తున కోట్లు మంజూరు చేసింది.