ధ్వజారోహణంతో ముగిసిన ఉత్సవాలు
తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రం ఆలయంలో నిర్వహించిన ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి.
సాయంత్రం 8.40 నుండి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ ఏ అండ్ సిఏవో ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, అర్చకులు, ఏవీఎస్వో మోహన్ రెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతిలోని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్న , జల ప్రసాదాలను కల్పించింది.