Friday, April 18, 2025
HomeDEVOTIONALఎస్వీ గోశాలను తనిఖీ చేసిన ఈవో

ఎస్వీ గోశాలను తనిఖీ చేసిన ఈవో

ఈవో వెంట జేఈవో గౌత‌మి హాజ‌రు

తిరుపతి – తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను టీటీడీ ఈవో జె.శ్యామలరావు జేఈవో(విద్య, ఆరోగ్యం) గౌతమితో కలిసి తనిఖీ చేశారు.

ముందుగా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో గో సంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి గోశాల కార్యాకలాపాల పై వివరంగా పీపీటీ ఇచ్చారు. మొత్తం ఐదు గోశాలలోని పశువుల సంఖ్య, దాణా మిక్సింగ్ ప్లాంటు, అగరబత్తీల‌ యూనిట్, నెయ్యి ట్యాంకర్లు, గుడికో గోమాత వంటి కార్యాకలాపాలను ఈవో సమీక్షించారు.

అనంతరం ఎస్వీ గోశాల కు చేరుకున్నారు ఈవో జె. శ్యామ‌ల రావు, జేఈవో గౌత‌మి. నెయ్యి ప్లాంటు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, దాణా మిక్సింగ్ యూనిట్, అగరబత్తీల‌ యూనిట్ లో చేపట్టిన ప్రోజెక్టులను పరిశీలించారు. నాణ్యత మెరుగు పరిచేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సిఈ సత్య నారాయణ, ఎస్ఈలు జగదీశ్వర్ రెడ్డి, మనోహరం, వెంకటేశ్వరులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments