Wednesday, June 18, 2025
HomeDEVOTIONALఘ‌నంగా స్న‌ప‌న తిరుమంజ‌నం

ఘ‌నంగా స్న‌ప‌న తిరుమంజ‌నం

కోదండరాముని తెప్పోత్సవాలు ఘ‌నం

తిరుప‌తి – తిరుపతి లోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం శ్రీకోదండ రామ స్వామి తెప్పోత్సవాలు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామ లక్ష్మణులు ఆశీనులై ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.

ఆలయ డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, ఏఈవో ర‌వి, సూపరింటెండెంట్‌ ముని శంక‌ర్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments