భారీ ఎత్తున తనిఖీలు చేసిన పోలీసులు
తిరుమల – తిరుమలలో ఉన్న మఠంల వద్ద తీసుకుంటున్న భద్రతా చర్యలపై ఆరా తీశారు పోలీసులు. పెద్ద ఎత్తున భక్తులు ఆయా మఠాలలో ఉంటున్నారు. ఇంకొన్ని తమ వారికి చెందిన వారే ప్రయారిటీ ఇస్తున్నారన్న ఆరోపణలు లేక పోలేదు. తమ ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక భద్రత అనేది ముఖ్యమని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తిరుమల పుణ్య క్షేత్రంలో 32కి పైగా మఠాలు ఉన్నాయి. చట్టం ప్రకారం ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ లో సేఫ్టీ , సెక్యూరిటీ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మఠం వద్ద తప్పనిసరిగా ఒక సెక్యూరిటీ గారర్డు ఉండాలి. యాత్రికుల భద్రతా చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మఠాన్ని సందర్శించే వారిని, వారు తీసుకు వచ్చే లగేజీని తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పద్ధర్థాలు , హానికర వస్తువులను తనిఖీలు చేపట్టాలి.
ఒకవేళ అలాంటివి కనిపిస్తే వెంటనే యజమాన్యం దృష్టికి తీసుకు రావాలి. పోలీసు, టీటీడీ విజిలెన్స్ దృష్టికి తీసుకు రావాలని స్పష్టం చేశారు. యాత్రికుల వాహనాలను క్రమ పద్దతిలో పార్కింగ్ స్థలంలో ఉంచేలా చూడాలి. మఠానికి ఉన్న అన్నీ ప్రవేశ మార్గాలను మూసివేసి, ఒకే మార్గము ద్వారా రాక పోకలను జరిపించాలని సూచించారు. సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు పోలీసులు.
వీటిని పాటించక పోతే Public Safety (Measures) Enforcement Act- 2013 ప్రకారం చట్టరీత్యా తగు చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి సారి తప్పుగా రూ. 5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.