మూడు రోజుల పాటు సిట్ ఎంక్వయిరీ
నెల్లూరు జిల్లా – అక్రమ మైనింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విచారణ ముగిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం మూడు రోజుల పాటు విచారణ కొనసాగింది. సుదీర్ఘంగా సుమారు 24 గంటల పాటు ప్రశ్నించారు. కాకాణి వద్ద నుండి ఎటువంటి సమాచారం వచ్చిందనేది అత్యంత గోప్యంగా భద్రపరిచారు పోలీసులు. కాకాణి ఇచ్చిన సమాచారం మేరకు తదుపరి కార్యాచరణకు సిద్దమయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉంది.
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ముగిసిన పోలీస్ కస్టడీ, వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో హాజరు పరిచారు. జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం వద్ద గల రుస్తుం మైన్ లో అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాలు కలిగి ఉండడం, గిరిజనులు ను బెదిరించారని కాకాణి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఈ అక్రమ మైనింగ్ కేసులో A4 ముద్దాయిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు.
విచారణ అధికారిగా ఘట్టమైన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణ పట్నం పోలీస్ స్టేషన్లో విచారించారు, ఐదు గంటలకు పోలీస్ కస్టడీ ముగియడంతో కాకాణిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి న్యాయస్థానంలో హాజరు పరిచి అనంతరం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ సందర్భంగా కాకాణి తరుపున వాదిస్తున్న లాయర్ రోజా రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో కాకాణిని వైద్య పరీక్షలు ముగించి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.