Saturday, June 14, 2025
HomeDEVOTIONALగజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి

గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి

భ‌క్తుల‌కు అభయహస్తం ఇచ్చిన స్వామి వారు

తిరుప‌తి లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి 07.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

రాత్రి గజ వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంట‌ల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు.

శుక్రవారం ఉదయం 08.00 గం.లకు సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఉత్స‌వాల‌కు సంబంధించి ఏర్పాట్లు చేశారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. నిత్య అన్నదానంతో పాటు జ‌ల ప్ర‌సాదం అంద‌జేస్తున్నారు. ప్ర‌ధానంగా శ్రీ‌వారి సేవ‌కులు విశిష్ట సేవ‌లు అందిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments